- మహిపాల్కు హ్యాట్రిక్ విజయాన్ని ఇస్తే..పార్టీ మారేందుకు మనసేలా వచ్చింది?
- మేం నమ్మకున్నది ప్రజలు, కార్యకర్తలనే..
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు
ఇదేనిజం, తెలంగాణ బ్యూరో : ఎమ్మెల్యేలు ఉన్నా వెళ్లిపోయినా బీఆర్ఎస్కు ఒరిగేదేం లేదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. బుధవారం ఆయన పటాన్చెరు నియోజకవర్గంలోని బీరంగూడలో విలేకరులతో మాట్లాడారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డిని మూడుసార్లు బీఆర్ఎస్ కార్యకర్తలు కష్టపడి గెలిపించుకుంటే కాంగ్రెస్లోకి వెళ్లడానికి ఎలా మనసు వచ్చిందన్నారు. పటాన్ చెరులో ఎమ్మెల్యే గూడెం పోయిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు గుండె ధైర్యం కోల్పోకుండా ఉండాలన్నారు. వైఎస్ హయాంలోనూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను లాక్కున్నారని, అప్పుడంతా బీఆర్ఎస్ పని అయిపోయిందన్నారని, కానీ బీఆర్ఎస్ ఎదురులేని శక్తిగా ఎదిగిందన్నారు. తాము కేవలం పార్టీ కార్యకర్తలను, తెలంగాణ ప్రజలను నమ్ముకున్నామన్నారు.