మహబూబాబాద్ జిల్లా గార్ల గ్రామానికి చెందిన నర్సమ్మకు ముగ్గురు కుమారులు కాగా ముగ్గురికి వివాహం చేసింది. ముగ్గురు కొడుకులు ఉపాధి నిమిత్తం వేర్వేరు ప్రాంతాలకు వెళ్లడంతో, తల్లి నుంచి ఇల్లు, మూడెకరాలు భూమి, బంగారం తీసుకున్నారు. కాలక్రమంలో ఇల్లు పాడుబడి కూలిపోవడంతో, తల్లిని కొడుకులు ఒంటరిగా వదిలేయడంతో నర్సమ్మ వీధిపాలై ఇప్పుడు భిక్షాటన చేసుకుంటుంది. తనకు న్యాయం చేయాలని.. కాసింత ఆకలి తీరిస్తే చాలని ఆ వృద్ధురాలు వేడుకుంటుంది.