ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ యాత్రలో విషాదం చోటు చేసుకుంది. ఇక్కడి చిద్వాసాలో కొండ చరియలు విరిగిపడి ముగ్గురు భక్తులు మృతి చెందారు. మరో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై ఆ రాష్ట్ర సీఎం పుష్కర్సింగ్ ధామీ విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించేందుకు సహాయక చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.