వచ్చే ఏడాది పాకిస్థాన్ వేదికగా జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా ఆడడంపై అనిశ్చితి నెలకొంది. భారత్ ఆడే మ్యాచ్లను మాత్రం గతంలో ఆసియా కప్ జరిగినట్లు వేరే దేశంలో నిర్వహించాలని బీసీసీఐ కోరుతున్నట్లు తెలుస్తోంది. దుబాయ్ లేదా శ్రీలంకలో నిర్వహించాలని కోరుతన్నట్లు సమాచారం. ఐసీసీ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. పాక్లో ఆడేలా బీసీసీఐని ఒప్పించే బాధ్యతను పీసీబీకి అప్పగించింది.