సామాన్యులకు నిత్యావసర ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. పప్పు, ఉప్ప నుంచి మొదలు చికెన్, మటన్, కూరగాయల వరకు ధరలు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. ఒకప్పుడు మార్కెట్ లో సంచి తీసుకుని వెళ్తే వంద రూపాయలకు సంచి సగం వచ్చేవని.. కానీ ఇప్పుడు రెండు ఐటమ్స్ రావడమే కష్టంగా మారింది. ఇటీవల కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ప్రతిదీ కిలో రూ.60 నుంచి రూ.100 వరకు పలుకుతుంది.