తెలంగాణ బడ్జెట్కు రాష్ట్ర కేబినేట్ ఆమోదం తెలిపింది. తెలంగాణ అసెంబ్లీ కమిటీ హాల్లో సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం.. 2024-25 బడ్జెట్పై చర్చలు జరిపి, ఆమోద ముద్ర వేసింది. మధ్యాహ్నం 12 గంటలకు శాసనసభలో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క, శాసనమండలిలో మంత్రి శ్రీధర్బాబు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. నేడు అసెంబ్లీకి బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ హాజరయ్యే అవకాశం ఉంది.