హీరోయిన్ ప్రణీత సుభాష్ మరోసారి గుడ్ న్యూస్ చెప్పారు. తాను రెండోసారి తల్లి కాబోతున్నట్లు తెలిపుతూ.. బేబీ బంప్తో ఉన్న తన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫొటోలు చూసిన ఫ్యాన్స్ ప్రణీతకు విషెస్ చెబుతున్నారు. కాగా, ‘ఏం పిల్లో ఏం పిల్లడో’ చిత్రంతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె అత్తారింటికి దారేది సినిమాతో బాగా పాపులర్ అయ్యారు. ప్రణీత 2022లో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.