విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ బుధవారం దేశీయ మార్కెట్లోకి కొత్త కార్లను తీసుకొచ్చింది. ఆల్-న్యూ 5 సిరీస్ లాంగ్ వీల్బేస్ ప్రారంభ ధర రూ.72.9 లక్షలుగా ఉంది. న్యూ మినీ కూపర్ ఎస్ ధర రూ.44.9 లక్షలు, న్యూ ఆల్-ఎలక్ట్రిక్ మినీ కంట్రీమ్యాన్ ధర రూ.54.9 లక్షలుగా ఉంది. ‘హైబ్రిడ్ వాహనాలపై 43%, విద్యుత్తు వాహనాలపై 5% పన్నే ఉన్నందున, భారత్లో పూర్తిగా విద్యుత్ వాహనాలు విడుదల చేయడంపై సంస్థ దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది.