ఇదేనిజం, జగిత్యాల: జగిత్యాల పట్టణంలో సాధారణ తనిఖీల్లో భాగంగా జగిత్యాల పట్టణంలోని హోటల్స్ మరియు కిరణ షాప్ లో కొన్ని ఫుడ్ శాంపిల్స్ తీసి ల్యాబ్ కు పంపడం జరిగినది. ఆ ఫుడ్ శాంపిల్స్ లో నాణ్యత తక్కువ వున్నది అని ల్యాబ్ రిపోర్టు రావడం జరిగినది. కావున సంబంధిత షాప్ యజమానులకు మొదటి తప్పుగా కొంత మొత్తాన్ని అపరద రుసుముగా జాయింట్ కలెక్టర్ రాంబాబు వేయడం జరిగింది.
- సామంతుల భోజనశాల- 2,50,000 rs/-
- సుఖీభవ రెస్టారెంట్- 50,000rs/-
- ఆనంద్ భవన్- 75,000rs/-
- నందిని సేవ మహల్- 35,000rs/-
- బెస్ట్ సూపర్ మార్కెట్- 1,00,000rs/-
- శివ సాయి కిరణం- 90,000rs/-
- శ్రీ రూప బెంగళూర్ బేకరీ- 30,000rs/-
ఇక ముందు నాణ్యత గల సరుకులను అందించక పొతే కఠినమైన చర్యలు ఉంటాయని వ్యాపారులకు ఫుడ్ ఇన్స్పెక్టర్ అనూష తెలిపారు.