భారత్-శ్రీలంక మధ్య నిర్వహిస్తున్న మూడు టీ-20ల సిరీస్లో భాగంగా నేడు తొలి మ్యాచ్ జరగనుంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ అనుభవం, సూర్యకుమార్ సారథ్యం, సత్తాగల యువ ఆటగాళ్లతో భారత్ సమతూకంగా ఉంది. కొత్త జట్టు మేళవింపుతో శుభారంభంపై దృష్టి సారించింది. రాత్రి 7 గంటల నుంచి సోనీ స్పోర్ట్స్లో మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కానుంది.
శ్రీలంకతో తొలి టీ20 తుది జట్టు(అంచనా): యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, రిషభ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్, రవి బిష్ణోయ్/ఖలీల్ అహ్మద్, మహమ్మద్ సిరాజ్.