తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడీగా జరుగుతున్నాయి. బడ్జెట్పై ప్రసంగం సందర్భంగా శాసనసభలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఎమ్మెల్యే హరీశ్రావు మధ్య మాటల యుద్ధం జరిగింది. మంత్రి వెంకట్రెడ్డి మాట్లాడుతూ.. ‘‘హరీశ్రావు వ్యాఖ్యలు దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉన్నాయి. ఆయన వద్ద సబ్జెక్ట్ లేదు. గతంలో ఆయనొక డమ్మీ మంత్రి’’ అని అన్నారు. దీనిపై హరీశ్రావు మాట్లాడుతూ.. ‘‘వెంకట్రెడ్డి హాఫ్ నాలెడ్జ్. ఆయన వద్ద ఏం సమాచారం లేదు’’ అని వ్యాఖ్యానించారు.