బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా కీలక నిర్ణయం తీసుకున్నారు. తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. అక్కడ సైనిక పాలన విధించడంతో ఆమె బంగ్లాదేశ్ను విడిచిపెట్టారు. ప్రస్తుతం ఆమెకు భారత్లో ఆశ్రయం ఇవ్వనున్నారని సమాచారం. దేశంలో జరుగుతున్న అల్లర్ల నేపథ్యంలో ఆమె పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. నిరసనల కారణంగా వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు.
బంగ్లాదేశ్ లో సైనిక పాలన!
హింసల నేపథ్యంలో ఆర్మీ హెచ్చరికలతో ప్రధాని పదవికి హసీనా రాజీనామా చేశారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో బంగ్లాలో ప్రభుత్వ ఏర్పాటుకు సైన్యం సిద్ధమైంది. లా అండ్ ఆర్డర్ మొత్తం సైన్యం చేతుల్లోకి వెళ్లిపోయింది. త్వరలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆ దేశ ఆర్మీ చీఫ్ వాకర్-ఉజ్-జమాన్ తెలిపినట్లు రాయిటర్స్ నివేదించింది.