బంగ్లాదేశ్లో అల్లర్లు జరుగుతున్న వేళ టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ డూప్ వీడియో ఒకటి వైరల్గా మారింది. ఐపీఎల్లోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు క్యాప్ ధరించి.. విరాట్ డూప్ ఒకరు బంగ్లాదేశ్ ఆందోళనలో పాల్గొన్నారు. ప్రధానిగా షేక్ హసీనా రాజీనామా చేసిన అనంతరం జరిగిన సంబరాల్లో ఈ ఘటన జరిగింది.