సచివాలయం రెండో బ్లాక్లో హోం మంత్రి అనితను వైఎస్ సునీత కలిశారు. తన తండ్రి వివేక హత్య కేసులో తనకు జరిగిన అన్యాయాన్ని అనితకు వివరించారు. విచారణ సమయంలో కేసు నీరు గారేలా అప్పటి ప్రభుత్వం వ్యవహరించిందని తెలిపారు. వివేక హత్య తదనంతరం జరిగిన పరిణామాలను హోం మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. హంతకులకు అండగా నిలిచిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. సీబీఐ విచారణకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని అనితా హామీ ఇచ్చారు.