ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మనీష్ సిసోడియాకు ఊరట లభించింది. లిక్కర్ కేసులో నమోదైన సీబీఐ, ఈడీ కేసుల్లో సిసోడియాకు సుప్రీంకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సుమారు 17 నెలల పాటు రిమాండ్లో ఉన్న సిసోడియా జైలు నుంచి విడుదల కానున్నారు. బెయిల్పై ఉన్నంత కాలం ఆయన దేశం విడిచి వెళ్లరాదని, పాస్పోర్టు ఇవ్వకూడదని కోర్టు షరతు విధించింది. ఈ సందర్భంగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేసు విచారణను పొడిగించడం సరికాదని, విచారణను త్వరగా పూర్తి చేయాలని కోరే హక్కు సిసోడియాకు ఉందని కోర్టు పేర్కొంది.