కౌన్ బనేగా కరోడ్పతి సీజన్ 16 ఇప్పటికే ప్రారంభమైన సంగతి తెలిసిందే. ‘కౌన్ బనేగా కరోడ్పతి-16’ కార్యక్రమంలో కంటెస్టెంట్ రామ్ కిషోర్ పండిట్ ను అమితాబ్ రూ.80వేల విలువైన ప్రశ్న అడిగారు. ‘2024లో ఐపీఎల్ కెప్టెన్లుగా ఉన్న ఈ ఆటగాళ్లలో భారత్ తరపున టెస్ట్ మ్యాచ్ ఆడనివారు ఎవరు? అని ప్రశ్న అడిగారు. ఆప్షన్గా ఎ-అయ్యర్, బి-పాండ్య, సి-సంజు శాంసన్, డి-రిషబ్పంత్ ఇచ్చారు. దీనికి రామ్ కిషోర్ రెండు లైఫ్లైన్లు వాడినా సమాధానం చెప్పలేకపోయారు. ఈ ప్రశ్నకు సమాధానం సంజు శాంసన్ అని అమితాబ్ తెలిపారు.