జార్ఖండ్లో షాకింగ్ ఘటన జరిగింది. 17 ఏళ్ల యువకుడు ఆదివారం రసగుల్లా గొంతులో చిక్కుకోవడంతో మరణించాడు. సదరు యువకుడు మంచంపై పడుకుని మొబైల్ ఫోన్ చూస్తూ రసగుల్లా తిన్నాడు. అయితే గొంతులో ఇరుక్కోవడంతో స్థానికులు ఎంత ప్రయత్నించినా బయటకు తీయలేకపోయారు. చివరికి యువకుడిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు.