అమర్ కౌశిక్ దర్శకత్వంలో శ్రద్ధా కపూర్, రాజ్కుమార్, పంకజ్ కీలక పాత్రల్లో నటించిన హారర్ కామెడీ థ్రిల్లర్ ‘స్త్రీ-2’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ నెల 15న విడుదలైన ఈ మూవీ థియేటర్లలో సక్సెస్ఫుల్గా రన్ అవుతోంది. ఈ మూవీలో సినిమాలో ‘ఆజ్ కీ రాత్’ అంటూ తమన్నా స్పెషల్ సాంగ్తో అభిమానులను ఉర్రూతలూగించింది. అయితే ఈ ప్రత్యేక గీతం చేసినందుకు తమన్నా ఏకంగా రూ.కోటి రూపాయలు ఛార్జ్ చేసినట్లు సమాచారం. దీంతో, స్క్రీన్పై తమన్నా 5 నిమిషాలు కనిపించినందుకు ఇంత మొత్తంలో తీసుకుందా అని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.