హైదరాబాద్లో భారీ కుంభకోణానికి పాల్పడిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు రూ.175 కోట్ల కుంభకోణానికి పాల్పడినట్లు గుర్తించారు. షంషీర్గాంజ్ ఎస్బీఐలోని ఆరు ఖాతాల్లో నగదు లావాదేవీలపై అనుమానంతో బ్యాంక్ అధికారులు ఫిర్యాదు చేశారు. ఆ నకిలీ ఖాతాల్లో భారీగా లావాదేవీలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. నిందితులు పేదల పేరుతో ఖాతాలు తెరిచి సైబర్ నేరాలకు పాల్పడ్డారు.