కష్టాల్లో ఉన్నవారికి సాయం అందించడానికి ఎప్పుడూ ముందుంటారు నటుడు ప్రభాస్. తాజాగా ఆయన మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. వరద విపత్తు నుంచి ఉపశమనం కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకొనే చర్యలకు సహాయపడాలని తన వంతుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రుల సహాయనిధికి చెరొక రూ.1 కోటి.. మొత్తం 2 కోట్లు విరాళం ఇస్తున్నట్లు తెలిపారు.