Homeహైదరాబాద్latest Newsనేడు కేరళ వెళ్లనున్నా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

నేడు కేరళ వెళ్లనున్నా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు సాయంత్రం కేరళ వెళ్లనున్నారు. వాయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నికకు కాంగ్రెస్‌ కీలక నేత ప్రియాంక గాంధీ రేపు నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. ఆమె నామినేషన్ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు.గత పార్లమెంట్ ఎన్నికల్లో రాహుల్ గాంధీ వాయనాడ్‌తో పాటు ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ నుంచి గెలుపొందారు. రెండు చోట్లా గెలిచాడు. ఈ క్రమంలో రాయ్ బరేలీ స్థానం నుంచి ఎంపీగా కొనసాగాలని నిర్ణయించుకున్నారు. వయనాడ్ ఎంపీ పదవికి రాజీనామా చేశారు. దీంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇప్పుడు ఆ స్థానం నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేస్తున్నారు. ప్రియాంక నామినేషన్ కార్యక్రమానికి రేవంత్‌తో పాటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు.

Recent

- Advertisment -spot_img