Homeఫ్లాష్ ఫ్లాష్కోవిడ్ నుంచి కోలుకున్న వారికి కొత్త టెన్షన్‌

కోవిడ్ నుంచి కోలుకున్న వారికి కొత్త టెన్షన్‌

హైదరాబాద్: కోవిడ్ వచ్చి కోలుకున్న అనంతరం ఆరోగ్య ఇబ్బందులతో ప్రస్తుతం హైదరాబాద్‌ నగర ఆసుపత్రులలో వందలాది పోస్ట్ కోవిడ్ పేషెంట్స్ జాయిన్ అవుతున్నారు.

ఇప్పుడు చాలా మంది రోగులు ఇంటిలోనే క్వారెంటైన్ అయ్యి తెలిసిన మందులతో ఈ కరోనాని తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.

అయితే వారి కంటే ఎక్కువగా ఆసుపత్రులలో చేరి చికిత్స పొందిన వారికే ఈ పోస్ట్ కోవిడ్ సమస్యతో ఇబ్బంది పడుతున్నట్టు ఓ కార్పోరేట్ ఆసుపత్రి వర్గాల నుండి అందుతున్న సమాచారం.

ప్రస్తుతం ప్రభుత్వ గాంధీ ఆసుపత్రి సహా నగరంలోని ప్రైవేట్ ఆసుపత్రులలో 300 పోస్ట్ కోవిడ్ కేసుల రోగులు చికిత్స పొందుతున్నట్టు చెబుతున్నారు.

డేంజర్ సమస్యలు

ఈ పోస్ట్ కోవిడ్ సమస్యలు కొన్ని పెద్దగా ఇబ్బంది కల్గించకున్నా వైద్య సహాయం అవసరమయ్యే తీవ్రమైన సమస్యలలో పక్షవాతం, గుండెపోటు మరియు డయాలసిస్, అలానే మల్టీ ఆర్గాన్ ఫైల్యూర్ లాంటివి ఉన్నాయి.

వైరస్ వచ్చి తగ్గిన 15 రోజుల నుండి 3 నెలల వరకు కనిపించే ఈ తీవ్రమైన పోస్ట్-కోవిడ్ సమస్యలకు ప్రధాన కారణం ఏమిటంటే, కరోనా వైరస్ వలన రక్త నాళాల గడ్డకట్టుకు పోయి ఈ ఇబ్బందులు తలేత్తుతున్నట్టు చెబుతున్నారు.

పోస్ట్ కోవిడ్ తోనే తీవ్ర నష్టం 

కరోనా రోగికి జరగాల్సిన ఎక్కువ నష్టం ఈ పోస్ట్ కోవిడ్ కాలంలోనే జరుగుతుందని నిపుణులు చెప్తున్నారు.

స్టెరాయిడ్ చికిత్స, యాంటీ కోగ్యులెంట్స్, యాంటీ ప్లేట్‌లెట్స్‌ చికిత్సలను ప్రారంభంలోనే ప్రారంభించడం చాలా ముఖ్యమని చెబుతున్నారు.

కోవిడ్ -19 తో సమస్య ఏమిటంటే, మరణాలు తక్కువగా ఉన్నప్పటికీ, ఈ వైరస్ వలన వస్తున్న పోస్ట్ కోవిడ్ ఇబ్బందులతో మొదటి 10 రోజుల్లో హాజరు కాకపోతే అది అలాగే ఉంటుందని చెబుతున్నారు.

ఈ కరోనా మొదట్లో ప్రతి ఒక్కరూ ఆసుపత్రికి వచ్చేవారని కానీ ఇప్పుడు ఇప్పుడు చాలా కేసులు కాంప్లికేట్ అయితేనే చాలా ఆలస్యంగా వస్తున్నాయని చెబుతున్నారు.

Recent

- Advertisment -spot_img