Homeక్రైంఒకే కుటుంబానికి ముగ్గురి దారుణ హత్య

ఒకే కుటుంబానికి ముగ్గురి దారుణ హత్య

– పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో ఘోరం
– పోలీసుల ఎదుట లొంగిపోయిన నిందితులు

ఇదే నిజం, ఏపీ బ్యూరో: పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో ముగ్గురు దారుణ హత్యకు గురయ్యారు. కోనంకి గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని సమీప బంధువులు విచక్షణారహితంగా కత్తులతో నరికి చంపారు. మృతులను సాంబశివరావు (50), భార్య ఆదిలక్ష్మి (47), కుమారుడు నరేష్‌ (30)గా పోలీసులు గుర్తించారు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ హత్యలు జరిగినట్లు పోలీసులు తెలిపారు. హత్యలకు సంబంధించి ముప్పాళ్ల పీఎస్‌లో సాంబశిరావు కోడలు మాధురి, నిందితులు లొంగిపోయినట్లు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వివరించారు.

Recent

- Advertisment -spot_img