టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి చెందిన వన్ 8 కమ్యూన్ పబ్పై బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో ఎంజీ రోడ్డులోని వన్ 8 కమ్యూన్, చర్చి స్ట్రీట్లోని ఎంపైర్ రెస్టారెంట్, బ్రిగేడ్ రోడ్డులోని పాంజియో బార్&రెస్టారెంట్లు అర్ధరాత్రి వరకు తెరిచి ఉంచడాన్ని గుర్తించారు. దీంతో అర్ధరాత్రి దాటినా తెరిచి ఉంచడంతో ఆయా రెస్టారెంట్ల పై పోలీసులు FIR నమోదు చేశారు.