– సీపీఐ ఎంఎల్ జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్
ఇదే నిజం టేకుమట్ల : అమాయక ప్రజల బలహీనతను ఆసరాగా చేసుకొని అధిక మొత్తంలో డబ్బులు లాగుతున్న వైన్స్ యజమానులపై చర్యలు తీసుకోవాలని సీపీఐ ఎంఎల్ జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్ డిమాండ్ చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండల కేంద్రంలో ఉన్నటువంటి రెండు వైన్స్ షాపుల యజమానులు సిండికేట్గా ఏర్పడి ఎమ్మార్పీపై ఒక క్వార్టర్ పై రూ. 20, ఒక ఫుల్ బాటిల్ పై రూ. 80 వరకు అధికంగా వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఇష్టమొచ్చినట్టుగా వ్యవహరిస్తూ ఇష్టం వచ్చిన రేట్లుకు మద్యం అమ్ముతున్న వీరిపైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వైన్స్ షాపుల యజమాన్యం విచ్చలవిడి దందాను అరికట్టాలని ఆయన కోరారు.