Homeహైదరాబాద్latest Newsబొల్లారం మున్సిపాలిటీలో పరిధిలో ఘోర ప్రమాదం.. బిల్డింగ్ గోడ కూలి ఒకరి మృతి

బొల్లారం మున్సిపాలిటీలో పరిధిలో ఘోర ప్రమాదం.. బిల్డింగ్ గోడ కూలి ఒకరి మృతి

ఇదే నిజం, బొల్లారం: సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గ జిన్నారం మండలం బొల్లారం మున్సిపాలిటీ పరిధిలోని లక్ష్మీ నగర్ కాలనీలో బుధవారం రాత్రి 11 గంటలకు ఒక బిల్డింగ్ గోడ కూలి ఒక వ్యక్తి మృతి చెందారు. మృతుని భార్య, కుమారుడికి గాయాలయ్యాయి. బాధితులను బీజేపీ పార్టీ టౌన్ అద్యక్షుడు కేజేఆర్ ఆనంద్ కృష్ణారెడ్డి మొదట మమతా మెడికల్ కాలేజీ తరలించగా అక్కడ వారు మల్లారెడ్డి హాస్పిటల్ కి రిఫర్ చేయడం తో అక్కడ అంబులెన్స్ లేక పోవడంతో తన కారు లో స్వయంగా మల్లారెడ్డి హాస్పిటల్ లో చేర్పించారు. ఆనంద్ కృష్ణారెడ్డి దగ్గర దగ్గరుండి హాస్పిటల్ లో అక్కడే హాస్పిటల్ లో రాత్రి నుండి అక్కడే ఉండి బాధితులకు బాసటగా నిలిచారు. బాదితులు ఆనంద్ కృష్ణారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

Recent

- Advertisment -spot_img