Homeక్రైంచెట్టును ఢీకొట్టిన లారీ.. ఒకరి మృతి

చెట్టును ఢీకొట్టిన లారీ.. ఒకరి మృతి

– ఏటూరునాగారంలో ఘటన

ఇదే నిజం, తెలంగాణ బ్యూరో: ఓ ఇసుక లారీ అదుపు తప్పి చెట్టును ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన ములుగు జిల్లాలోని ఏటూరు నాగారం మండలం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. మంగపేట మండలం కోమటిపల్లి గ్రామానికి చెందిన కొత్తపల్లి పెద్ద సమ్మయ్య (55) అనే వ్యక్తి ఏటూరునాగారం అటవీశాఖ చెక్‌పోస్ట్‌ వద్ద హనుమకొండ వెళ్లేందుకు లారీ ఎక్కాడు. ఈ క్రమంలో లారీ అదుపు తప్పి చెట్టును ఢీకొట్టడంతో సమ్మయ్య మృతి చెందాడు. లారీ డ్రైవర్ క్యాబిన్​లో ఇరుక్కోవడంతో గ్యాస్ వెల్డింగ్‌తో కట్ చేసి డ్రైవర్‌ను బయటకు తీసి హాస్పిటల్‌కు తరలించారు. కాగా, మృతుడు పెద్ద సమ్మయ్య హైదరాబాదులో పెయింటర్​గా పనిచేస్తున్నాడు. దీపావళి పండుగకు తన స్వగ్రామమైన మంగపేట మండలం కోమటిపల్లి కొచ్చి తిరిగి వెళుతున్న క్రమంలో ప్రమాదానికి గురై మృతి చెందాడు. సమ్మయ్య మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Recent

- Advertisment -spot_img