Homeహైదరాబాద్latest Newsమద్యానికి బానిసై మేడ పైనుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య

మద్యానికి బానిసై మేడ పైనుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య

ఇదే నిజం, మల్కాజిగిరి: మద్యానికి బానిసై వ్యక్తి మేడ పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన అల్వాల్ PS పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. మచ్చబొల్లారం బజార్ వాసి కృష్ణ సంజీవ్ కుమార్ (46) మద్యానికి బానిసయ్యాడు. దీంతో మద్యం మాన్పించడం కోసం రీహబ్ సెంటర్లో కుటుంబ సభ్యులు అతడిని చేర్పించారు. 3 నెలల చికిత్స అనంతరం 17న ఇంటికి తీసుకురాగా మరుసటి రోజు చేతులు కడుక్కొని వస్తానని చెప్పి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Recent

- Advertisment -spot_img