Homeహైదరాబాద్latest Newsఫోన్ ట్యాపింగ్ కేసులో నయా ట్విస్ట్.. రంగంలోకి ఈడీ?

ఫోన్ ట్యాపింగ్ కేసులో నయా ట్విస్ట్.. రంగంలోకి ఈడీ?

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈడీ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ డబ్బులను పోలీసు వాహనాల్లో తరలించారన్న రాధాకిషన్ రావు స్టేట్మెంట్ ఆధారంగా ఈడీ అధికారులు దర్యాప్తు చేయనున్నారు.
గత ఎన్నికల సమయంలో హవాలా మార్గంలో నగదు తరలింపుపై ఈడీ ఆరా తీస్తున్నట్లు సమాచారం. పోలీస్ వాహనాల్లో ఎన్ని కోట్లు తరలించారనే దానిపై దర్యాప్తు బృందాన్ని వివరాలు అడిగి తెలుసుకోనున్నారు.

Recent

- Advertisment -spot_img