Sangareddy : సంగారెడ్డి జిల్లా కొండాపూర్లో విషాదం జరిగింది. డీసీఎం వాహనం అదుపు తప్పి బైక్ను ఢీకొట్టిన ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. కొండాపూర్ మండలం తొగర్పల్లి గ్రామానికి చెందిన పడమటి లక్ష్మణ్..వీరన్నగూడలో బంధువుల అంత్యక్రియలకు వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగింది. వీరన్నగూడ ప్రధాన రహదారి వద్ద డీసీఎం అదుపు తప్పి బైక్ను ఢీకొట్టింది. లక్ష్మణ్ తలకు తీవ్రమైన గాయాలు కాగా సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. గుమ్మడిదల ఎస్ఐ మహేశ్వర్ రెడ్డి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.