ఇదే నిజం చింతల మనేపల్లి: రేపటి నుంచి కొత్త విద్యాసంవత్సరం ప్రారంభం కానుండగా.. బడులన్నీ ముస్తాబవుతున్నాయి. కానీ చింతలమానేపల్లి మండలం గంగాపూర్ లోని ప్రభుత్వ పాఠశాల మాత్రం నిర్వహణ వైఫల్యంతో తయారైంది. పాఠశాలలోని నాలుగు గదులకుగాను రెండింటిని మిషన్ భగీరథ కోసం ఇలా వాడుతున్నారు. చెత్తా చెదారంతో దుర్భరంగా మారిన ఇక్కడే ఈ నెల 6న బడిబాట కూడా ప్రారంభమైంది.