Homeహైదరాబాద్latest Newsఎయిర్‌టెల్ యూజర్స్​కు షాక్.. భారీగా పెరగనున్న రీఛార్జ్ ప్లాన్స్ రేట్లు..!

ఎయిర్‌టెల్ యూజర్స్​కు షాక్.. భారీగా పెరగనున్న రీఛార్జ్ ప్లాన్స్ రేట్లు..!

ఎయిర్‌టెల్ యూజర్స్​కు షాక్ తగలనుంది. ఎయిర్‌టెల్ రీఛార్జ్ ప్లాన్స్ రేట్లు భారీగా పెరగనున్నాయి. భారతీ ఎయిర్‌టెల్ సీఈవో గోపాల్ విట్టల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో మొబైల్ ఛార్జీలను గణనీయంగా పెంచాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ప్రస్తుతం ప్రతి వినియోగదారుడిపై కంపెనీ సగటు ఆదాయం సుమారు రూ. 200గా ఉందని, నిజానికి ఇది దాదాపు రూ.300 ఉండాలని ఆయన పేర్కొన్నారు. రూ.300లకు పెంచినప్పటికీ ప్రపంచంలోనే ఇదే అత్యల్ప ఏఆర్‌పీయూగా ఉంటుందని విట్టల్ అభిప్రాయపడ్డారు. ఆయన వ్యాఖ్యలను బట్టి చూస్తే త్వరలోనే ఎయిర్‌టెల్ రీఛార్జ్ ప్లాన్స్ రేట్లు గణనీయంగా పెరగవచ్చుననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ధరల పెంపుపై ఆయన సంకేతాలు ఇచ్చారని విశ్లేషిస్తున్నారు. భవిష్యత్తులో ఎయిర్‌టెల్ ప్లాన్‌లు మరింత ఖరీదైనవిగా మారడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Recent

- Advertisment -spot_img