Homeహైదరాబాద్latest Newsమధుర జ్ఞాపకాలను గుర్తు చేసిన ఆత్మీయ సమ్మేళనం

మధుర జ్ఞాపకాలను గుర్తు చేసిన ఆత్మీయ సమ్మేళనం

ఇదే నిజం, రాయికల్: రాయికల్ మండలంలోని భూపతిపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2011-12 విద్యా సంవత్సరంలో 10 వ తరగతి విద్యనభ్యసించిన పూర్వ విద్యార్థులు శు క్రవారం ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను శాలువాతో ఘనంగా సత్కరించి జ్ఞాపకను అందజేసి వారి ఆశీస్సులు తీసుకున్నారు. పూర్వ విద్యార్థులు ఒకే చోట చేరడంతో పాఠశాల ఆవరణమంతా సందడిగా నెలకొంది. కార్యక్రమానికి పాఠశాల భూపతిప్పున్, హాజరైన ఉపాధ్యాయులు ప్రసంగిస్తూ ఇక నుంచి అందరూ కలిసి ఉండాలని, జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు ఎదురైనా ఒక్కరికొకరు సహకరించుకుంటూ జీవితంలో అత్యున స్థానానికి చేరుకోవాలని, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా తల్లిదండ్రులను వదలకూడదని, సమాజంలో మంచి గుర్తింపును తెచ్చుకోవాలని తెలిపారు. అనంతరం అందరు కలిసి సహపంక్తి భోజనం చేసి తదుపరి ఆటపాటలతో ఉల్లాసంగా గడిపారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు శ్రీపతి రాఘవులు, పడాల తిరుపతి, దుంపేట జగన్, కొల్లూరి రాజేందర్, ఎదండి రమేష్, ముక్కెర శేఖర్, బొల్లె చిన్నయ్య, శ్రీనివాస్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img