ఛత్తీస్గఢ్లో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. బెమెతరా జిల్లాలోని గన్పౌడర్ తయారీ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 17 మంది మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.