Homeహైదరాబాద్latest Newsజేఈఈ ఫలితాల్లో తెలంగాణ బిడ్డల సత్తా

జేఈఈ ఫలితాల్లో తెలంగాణ బిడ్డల సత్తా

– 100 పర్సంటైల్​ పొందిన విద్యార్థులు

జేఈఈ మెయిన్‌ సెషన్‌-1 రిజల్ట్స్​ వచ్చేశాయి. ఈ ఫలితాల్లో తెలంగాణ బిడ్డలు సత్తా చాటారు. మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీలో పర్సంటైళ్లతోపాటు మొత్తం జేఈఈ మెయిన్‌ పర్సంటైల్‌ కూడా తెలుసుకోవచ్చు. ఇందులో తెలంగాణకు చెందిన విధిత్‌, సాయితేజ, అనూప్‌, దినేశ్‌ రెడ్డిలు 300లకు 300 మార్కులు సాధించి 100 పర్సంటైల్‌ పొందారు.జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు ఈ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఫలితాలను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ మంగళవారం ఉదయం విడుదల చేసింది. ఎన్‌టీఏ అధికార వెబ్‌సైట్‌ https://jeemain.nta.ac.in/ లో విద్యార్థులు తమ స్కోర్‌ కార్డును చూసుకోవచ్చు. అప్లికేషన్‌ నంబర్‌, పుట్టిన తేదీ, సెక్యూరిటీ పిన్‌ ద్వారా ఫలితాలు పొందవచ్చు. ఇప్పటికే ఈ పరీక్షకు సంబంధించిన తుది కీని ఎన్టీఏ విడుదల చేసిన విషయం తెలిసిందే.

Recent

- Advertisment -spot_img