Homeహైదరాబాద్అనిశా వలలో సర్వే, ల్యాండ్​ శాఖ​ అధికారి

అనిశా వలలో సర్వే, ల్యాండ్​ శాఖ​ అధికారి

హైదరాబాద్​–ఇదేనిజం – అనిశా అధికారులకు ఒక ప్రభుత్వ ఉద్యోగి అడ్డంగా దోరికిన సంఘటన నగరంలో గురువారం చోటుచేసుకుంది. అనిశా అధికారుల కథనం ప్రకారం రంగారెడ్డి జిల్లా సర్వే ఆండ్​ ల్యాండ్​ విభాగంలో విధులు నిర్వహిస్తున్న అధికారి సూప్రిడెంట్​ వెంకటేశ్వర్​రెడ్డి, ఒక వ్యక్తిని సర్వే రిపోర్ట్​ కోసం రూ.5 వేలు లంచం డిమాండ్​ చేశాడు. దీంతో బాదితులు నేరుగా అనిశా అధికారులకు సంప్రదించాడు. దీంతో వారి సూచనాల మేరకు గురువారం ఆయన నగదు రూ. 5వేలు ఇస్తుండగా అనిశా అధికారులు రెడ్​హ్యండ్​గా పట్టుకుని అతని వద్ద నుంచి డబ్బులు స్వాధీనం చేసుకుని అతనిపై కేసు నమోదుచేసి న్యాయస్థానం ముందు హాజరుపరిచి రిమాండ్​కు తరలించడం జరుగుతుందని పేర్కోన్నారు. ప్రభుత్వ కార్యలయల్లో ఏవరైనా సిబ్బంది, అధికారులు లంచం డిమాండ్​ చేస్తే తమకు సమాచారం ఇవ్వాలని అనిశా అధికారులు సూచించారు.

Recent

- Advertisment -spot_img