హైదరాబాద్–ఇదేనిజం – అనిశా అధికారులకు ఒక ప్రభుత్వ ఉద్యోగి అడ్డంగా దోరికిన సంఘటన నగరంలో గురువారం చోటుచేసుకుంది. అనిశా అధికారుల కథనం ప్రకారం రంగారెడ్డి జిల్లా సర్వే ఆండ్ ల్యాండ్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న అధికారి సూప్రిడెంట్ వెంకటేశ్వర్రెడ్డి, ఒక వ్యక్తిని సర్వే రిపోర్ట్ కోసం రూ.5 వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాదితులు నేరుగా అనిశా అధికారులకు సంప్రదించాడు. దీంతో వారి సూచనాల మేరకు గురువారం ఆయన నగదు రూ. 5వేలు ఇస్తుండగా అనిశా అధికారులు రెడ్హ్యండ్గా పట్టుకుని అతని వద్ద నుంచి డబ్బులు స్వాధీనం చేసుకుని అతనిపై కేసు నమోదుచేసి న్యాయస్థానం ముందు హాజరుపరిచి రిమాండ్కు తరలించడం జరుగుతుందని పేర్కోన్నారు. ప్రభుత్వ కార్యలయల్లో ఏవరైనా సిబ్బంది, అధికారులు లంచం డిమాండ్ చేస్తే తమకు సమాచారం ఇవ్వాలని అనిశా అధికారులు సూచించారు.