భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఖమ్మం డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సును రాజమహేంద్రవరం నుంచి వస్తున్న ఆయిల్ ట్యాంకర్ కిష్టారం సమీపంలో అదుపుతప్పి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 12 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సత్తుపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.