బీహార్ లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. భాగల్పూర్ జిల్లాలోని ఘోఘా పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ లారీ.. పెళ్లి ఊరేగింపుతో వెళ్తున్న కారుపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారులో ఆరుగురు మృతి చెందారు. మృతుల్లో ఓ చిన్నారి కూడా ఉంది. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో పోలీసులు.. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. లారీ టైర్ పేలడంతోనే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.