సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం హుసెల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. జహీరాబాద్-బీదర్ రహదారిపై కారును… ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ సహా మహిళ మృతి చెందింది. మరో ఐదుగురికి గాయాలయ్యాయి. వీరిని జహీరాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతులు కర్ణాటకలోని బీదర్ వాసులుగా పోలీసులు గుర్తించారు.