కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మాచారెడ్డి మండలం ఘన్పూర్లో తుపాన్ చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. పోలీసులు క్షతగాత్రులను కామారెడ్డి ఆస్పత్రికి తరలించారు. వీరంతా మహారాష్ట్రలోని నాందేడ్ ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు