ఐరోపా దేశమైన చెక్ రిపబ్లిక్ రాజధాని ప్రాగ్ నుంచి హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. ఈ రోజు తెల్లవారుజామున గూడ్స్ రైలును ప్యాసింజర్ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా.. మరో 23 మంది తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ఈ సంఘటన ప్రాగ్కు తూర్పున 100 కిలోమీటర్లు (62 మైళ్ళు) దూరంలో ఉన్న పార్దుబిస్ నగరంలో జరిగిందని ఆ దేశ మంత్రి విట్ రాకుసన్ తెలిపారు.