Homeహైదరాబాద్latest Newsఅత్యాచార కేసులో నిందితుని కి 20 సంవత్సరాల జైలు శిక్ష..!

అత్యాచార కేసులో నిందితుని కి 20 సంవత్సరాల జైలు శిక్ష..!

ఇదే నిజం, జగిత్యాల టౌన్: అత్యాచారం కేసులో నిందితులకు 20 సంవత్సరాల కఠిన కారాగార జైలు శిక్ష మరియు రూ 5000/- జరిమాన పడింది. జగిత్యాల జిల్లా, బీర్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తీగల ధర్మారం గ్రామానికీ చెందిన బాధితురాలు 2018 లో అత్యాచార కేసు నమోదు అయ్యింది. బాదితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీస్ స్టేషన్ లో అప్పటి ఎస్సై కిరణ్ కుమార్ కేసు నమోదు చేయగా సర్కిల్ ఇన్స్పెక్టర్ లక్ష్మీ బాబు గారు కేసును విచారించడం జరిగింది. వారి పేర్లు నగేష్ మరియు కొమ్మిర సాయిలు అనే ఇద్దరికి ఈ రోజు పిపి గారు, కోర్ట్ డ్యూటీ అధికారులు సాక్షలను ప్రవేశపెట్టగా సాక్షులను విచారించిన న్యాయమూర్తి సుగాలీ నారాయణ గనిందితుని పై నేరం రుజువు అయ్యింది నిందితులకు 20 సంవత్సరాల చొప్పున కఠిన కారగార శిక్ష మరియు 5000/- జరిమాన విదిస్తూ తీర్పునిచ్చారు.

ఈ కేసులో అడిషనల్ పీపీ గా మల్లేశం గారు, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ గా ఇన్స్పెక్టర్ లక్ష్మీ బాబు గారు, ఎస్సై కిరణ్ కుమార్ గారు, CMS ఎస్.ఐ రాజు నాయక్, CMS కానిస్టేబుల్స్ కిరణ్, కోర్ట్ కానిస్టేబుల్ శ్రీధర్ లు నిందితులకి శిక్ష పడడం లో గౌరవ కోర్టుకు సాక్షాధారాలు అందించడం లో ప్రముఖ పాత్ర వహించడం జరిగింది. ఈ కేసులో నిందితులకు శిక్ష పడటం పడటం లో కృషి చేసిన పోలీసు అధికారుల ను జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఐపిఎస్ అభినందించారు.

Recent

- Advertisment -spot_img