Homeజాతీయందేశంలో​ 69878 కరోనా కేసులు

దేశంలో​ 69878 కరోనా కేసులు

భారత్‌ కరోనా వైరస్​తో పోరాడుతుంది. ప్రపంచ వ్యాప్తంగా ఇతర దేశాలతో పోలిస్తే భారత్​ సమర్ధవంతంగా ఎదుర్కొంటుంది. ఇతర దేశాల జనాబా, కేసులతో పోలిస్తే భారత దేశం చాలా మెరుగ్గా ఉందని చెప్పుకోవచ్చు. ఇక గత 24 గంటల్లో దేశంలో 69878 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 945 మంది మరణించారు. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2975702 కి చేరింది. 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని 63631 మంది డిశ్చార్జ్ అయ్యారు. దీంతో దేశ వ్యాప్తంగా కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 2222578 మందిగా ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. దేశంలో రికవరీ రేటు 74.30 శాతం ఉండగా, మరణాల రేటు 1.89 శాతంగా ఉంది. దేశంలో ప్రస్తుతం 697330 యాక్టివ్​ కేసులు ఉన్నాయి.

Recent

- Advertisment -spot_img