Homeహైదరాబాద్latest Newsతెలంగాణలో ఆదానీ రూ.12,400 కోట్ల ఇన్వస్ట్ మెంట్స్

తెలంగాణలో ఆదానీ రూ.12,400 కోట్ల ఇన్వస్ట్ మెంట్స్

దావోస్‌లోని జరిగిన ఆదానీ WORLD ECONOMIC FORUM సదస్సులో ఆదానీ గ్రూప్‌తో తెలంగాణ ప్రభుత్వం నాలుగు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. త్వరలో తెలంగాణలో రూ.12,400 కోట్ల రూపాయల పెట్టుబడులు పెడతామని అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ సీఎం రేవంత్ రెడ్డికి తెలిపారు. తెలంగాణలో 1350 మెగావాట్ల సామర్థ్యంతో రెండు పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టులను ఏర్పాటు చేసేందుకు అదానీ గ్రీన్ ఎనర్జీ రూ.5,000 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. చందన్‌వెల్లిలో మొత్తం 100 మెగావాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్ క్యాంపస్‌ను ఏర్పాటు చేసేందుకు అదానీకాన్ఎక్స్ డేటా సెంటర్ మరో రూ.5,000 కోట్లు పెట్టుబడి పెట్టనుంది.ప్రాజెక్టులకు అవసరమైన సౌకర్యాలు, మౌలిక సదుపాయాలు, సహాయ సహకారాలు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.

Recent

- Advertisment -spot_img