HomeజాతీయంAirForce Flight Tyre Theft : ఏకంగా యుద్ధ విమానం టైరును దొంగిలించారు

AirForce Flight Tyre Theft : ఏకంగా యుద్ధ విమానం టైరును దొంగిలించారు

AirForce Flight Tyre Theft : ఏకంగా యుద్ధ విమానం టైరును దొంగిలించారు

AirForce Flight Tyre Theft – లక్నోలోని భారత వాయుసేన స్థావరంలో విస్మయం కలిగించే సంఘటన జరిగింది.

ఏకంగా యుద్ధ విమానం టైరును అపహరించారు.

ఇటీవల వాయుసేన అధికారులు 5 టైర్లను రాజస్థాన్ లోని జోధ్ పూర్ ఎయిర్ బేస్ కు తరలించాలని నిర్ణయించారు.

వాటిని ఓ ట్రక్కులో ఉంచారు.

అందులో ఒక టైరు కనిపించకుండా పోవడంతో ట్రక్కు డ్రైవర్ పోలీసులకు సమాచారం అందించాడు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

అయితే ఈ నెల 3న దీప్ రాజ్, హిమాంశు బన్సల్ అనే వ్యక్తులు ఆ విమానం టైరును వాయుసేన అధికారులకు అప్పగించారు.

గత నెలలో ఓ సర్వీసు రోడ్డు వద్ద ఆ టైరును గుర్తించామని, లారీ టైరు అనుకుని తీసుకెళ్లామని వారు వివరించారు.

యుద్ధ విమానం టైరు కనిపించడంలేదని మీడియాలో చూసి ఆ టైరును తిరిగి ఇచ్చేసినట్టు వారిద్దరూ వెల్లడించారు.

దాంతో విమానం టైరు కథ సుఖాంతమైంది.

ఇంతకీ ఆ టైరును దొంగిలించింది ఎవరన్నది ఇంకా తేలలేదు.

Recent

- Advertisment -spot_img