AirForce Flight Tyre Theft : ఏకంగా యుద్ధ విమానం టైరును దొంగిలించారు
AirForce Flight Tyre Theft – లక్నోలోని భారత వాయుసేన స్థావరంలో విస్మయం కలిగించే సంఘటన జరిగింది.
ఏకంగా యుద్ధ విమానం టైరును అపహరించారు.
ఇటీవల వాయుసేన అధికారులు 5 టైర్లను రాజస్థాన్ లోని జోధ్ పూర్ ఎయిర్ బేస్ కు తరలించాలని నిర్ణయించారు.
వాటిని ఓ ట్రక్కులో ఉంచారు.
అందులో ఒక టైరు కనిపించకుండా పోవడంతో ట్రక్కు డ్రైవర్ పోలీసులకు సమాచారం అందించాడు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
అయితే ఈ నెల 3న దీప్ రాజ్, హిమాంశు బన్సల్ అనే వ్యక్తులు ఆ విమానం టైరును వాయుసేన అధికారులకు అప్పగించారు.
గత నెలలో ఓ సర్వీసు రోడ్డు వద్ద ఆ టైరును గుర్తించామని, లారీ టైరు అనుకుని తీసుకెళ్లామని వారు వివరించారు.
యుద్ధ విమానం టైరు కనిపించడంలేదని మీడియాలో చూసి ఆ టైరును తిరిగి ఇచ్చేసినట్టు వారిద్దరూ వెల్లడించారు.
దాంతో విమానం టైరు కథ సుఖాంతమైంది.
ఇంతకీ ఆ టైరును దొంగిలించింది ఎవరన్నది ఇంకా తేలలేదు.