Homeహైదరాబాద్ఏఐఎస్​ఎఫ్ 85వ వార్షికోత్సవం వేడుకలను జయప్రదం చేయాలి

ఏఐఎస్​ఎఫ్ 85వ వార్షికోత్సవం వేడుకలను జయప్రదం చేయాలి

మేడిపల్లి, ఇదే నిజం : ఆగస్టు 12 న ఏఐఎస్​ఎఫ్​ (అఖిల భారత విద్యార్థి సమాఖ్య) 85 వ వార్షికోత్సవం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా మొక్కలు నాటాలని విద్యార్థి సమాఖ్య అధ్యక్షుడు పుట్టా లక్ష్మణ్ పిలుపునిచ్చారు. అందులో భాగంగా మేడిపల్లి మండలంలో జంట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రభుత్వ విద్య సంస్థలలో మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్​ఎఫ్​ జిల్లా ఉపాధ్యక్షుడు ఎండీ అన్వర్, రాష్ట్ర గర్ల్స్ కన్వీనర్ నాగ జ్యోతి, జిల్లా నాయకులు హరీశ్, చిన్న, అజయ్, మనోహర్ తదితరులు పాల్గొన్నారు

Recent

- Advertisment -spot_img