ఇదేనిజం, మహబూబ్నగర్ : మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డిని బుధవారం ఏఐఎస్ఎఫ్ నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలోని పాఠశాలల్లో, వసతి గృహాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. దీనికి ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో పలువురు ఏఐఎస్ఎఫ్ నాయకులు పాల్గొన్నారు.