Homeజిల్లా వార్తలుబెల్లంపల్లిలో ఏఐటీయూసీ విజయోత్సవ ర్యాలీ

బెల్లంపల్లిలో ఏఐటీయూసీ విజయోత్సవ ర్యాలీ

ఇదే నిజం, బెల్లంపల్లి: సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఏఐటీయూసీ విజయఢంకా మోగించడంతో ఆదివారం బెల్లంపల్లిలో సీపీఐ, ఏఐటీయూసీ శ్రేణులు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. సీపీఐ కార్యాలయం నుంచి రామాటాకీస్ చౌరస్తా, పాత బస్టాండ్ మీదుగా కొనసాగింది. బాణాసంచా కాల్చుతూ పెద్దఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కార్మికులు తమపై ఉంచిన నమ్మకాన్ని తప్పకుండా నెరవేస్తామని కార్మికుల పక్షాన నిలబడి కార్మికులకు రావాల్సిన హక్కులను సాధించుకునే వరకు పోరాడుతామని వారు అన్నారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు వెంకటస్వామి, నరసయ్య, మల్లేష్, తిరుపతి గౌడ్ పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img