ఏపీ ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు మధ్యాహ్నం 2 గంటలకు విడుదల చేయనున్నారు. ఉదయం 11 గంటలకు విడుదల చేస్తామని అధికారులు తొలుత ప్రకటించారు.. అయితే తాజగా సమయంలో మార్పు చేశారు. ఈ పరీక్షలకు దాదాపు 1.40 లక్షల మంది హాజరయ్యారు. అలాగే ప్రథమ సంవత్సరం అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలను ఈ నెల 26న విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.