Homeజిల్లా వార్తలుఅర్హులందరికి ప్రభుత్వ పథకాలు అందుతాయి..

అర్హులందరికి ప్రభుత్వ పథకాలు అందుతాయి..

ఇదే నిజం, ప్రతినిధి వరంగల్: ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తు చేసుకున్న అర్హులందరికి ప్రభుత్వ పథకాలు అందుతాయని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. శనివారం కాజీపేట 62 డివిజన్ సోమిడి కమ్యూనిటి హాల్ వద్ద ఏర్పాటు చేసిన ప్రజాపాలన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజలకు ఏ ఇబ్బందులు ఉన్న ప్రభుత్వం దృస్టికి తీసుకురావాలని, ప్రతి సమస్యపై స్పందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని భరోసా ఇచ్చారు. అర్హులైన దరఖాస్తులందరికి ప్రభుత్వ పథకాలు అందుతాయని ఏ ఒక్కరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కార్యక్రమంలో 62 వ డివిజన్ కార్పో రేటర్ జక్కుల రవీందర్ యాదవ్, సయ్యద్ విజయశ్రీ రజాలి, కాజీపేట తహశీల్దార్ భావుసింఘ్ మాజీ కార్పోరేటర్ గుంటి కుమార్, సుంచు అశోక్, టిపీసిసి కార్యదర్శి సయ్యద్ రజాలి, మహమ్మద్ అంకుష్, నాగపూరి లలిత, రంగు సుధీర్, బుర్ర బాబు రావు, డివిజన్ అధ్యక్షులు పాలడుగుల ఆంజనేయులు, షేక్ అజ్గర్, పోగుల సంతోష్, కొండా శివ, టిపిసిసి ఎస్.సి. డిపార్ట్మెంట్ కొ-ఆర్డినేటర్ మోసేస్ పాల్, ఆనంద్ కుమార్ (ఏం.పి ఆనంద్) బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బంక సంపత్ యాదవ్, మహమ్మద్ రఫీ, తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img